బీపీఎల్ కుటుంబాలకు చెందిన మహిళలకు ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు


                       బీపీఎల్ కుటుంబాలకు చెందిన మహిళలకు ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు అందించే పథకం-ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కు కేంద్ర మంత్రి మండలి ఆమోదం  

బీపీఎల్ కుటుంబాలకు చెందిన మహిళలకు ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు అందించే పథకం-ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రి వర్గ సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. బీపీఎల్ కుంటుంబాలకు ఐదు కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు అందించటానికి రూ.8,000 వేల కోట్లు ఈ పథకం కింద కేటాయించారు. బీపీఎల్ కుటుంబాలకు ఒక్కొక్క ఎల్పీజీ కనెక్షను కింద రూ.1600 వందలు ఆర్ధిక సహాయం కింద ఈ పథకం నుంచి లబిస్తాయి. అర్హులైన బీపీఎల్ కుటుంబాలను రష్ట్ర్ర ప్రభుత్వాలు కేంద్ర పాలిత ప్రాంతాలను సంప్రదించిన మీదట ఎంపిక చేస్తారు. ఈ పథకాన్ని మూడు సంవత్సరాల పాటు అంటే 2016-17,2017-18,2018-19 లలో అమలు చేస్తారు.
అత్యంత పేదకుటుంబాలకు చెందిన కోట్లాది మహిళలకు ప్రయోజనం చేకూర్చే సంక్షేమ పథకాన్ని పెట్రోలియం,సహజ వాయువుల మంత్రిత్వ శాఖ అమలు చేయబోవటం దేశ చరిత్రలో ఇదే మొట్టమొదటసారి.
మన దేశంలో వంట గ్యాస్(ఎల్పీజీ)పరిమితంగానే పేదలకు అందుబాటులో ఉన్నది. ఎల్పీజీ సిలిండర్లు చాలా వరకు పట్టణ,సెమీ-అర్బన్ ప్రాంతాల్లో..అదికూడా మధ్యతరగతి సంపన్న కుటుంబాల కే ఉన్నాయి. అయితే శిలాజ జనిత ఇంధనాల పై ఆధారపడి వంట చేసే పద్దతి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. డబ్యూహెచ్వో అంచనాల ప్రకారం శుద్ది చేయని ఇంధనాలను వంటకు ఉపయోగించటం వల్ల భారత దేశంలో షుమారు 5 లక్షల మరణాలు సంభవిస్తున్నాయి. ఈ అకాల మరణాలలో అనేకం గుండె జబ్బు,స్ర్పోక్, ఊపిరితిత్తుల వ్యాధులు,స్వాసకోశ క్యాన్సర్ వంటి అసాంక్రమిక వ్యాధుల ఫలితమే. చిన్న పిల్లలలో ఊపిరి పీల్చుకోవటానికి సంబంధించిన తీవ్ర అస్వస్థత కూడా మృత్యు కారణమౌతున్నది. నిపుణులు చెప్పచున్నది ఏమిటంటే ఆరు బయలు ప్రదేశంలో వంట చేస్తుండటం, గంటకు నాల్గు వందల సిగరెట్లు కాల్చటంతో సమానం. 
బీపీఎల్ కుటుంబాలకు ఎల్పీజీ కనెక్షన్లు సమకూర్చటం ద్వారా దేశంలో అందరినీ వంటగ్యాస్ సదుపాయంలో పరిధిలోనికి తీసుకువచ్చినట్లౌతున్నది. ఈ ఫథకం మహిళలను వారి ఆరోగ్యం కాపాడుకునేటట్లు చేస్తుంది. అంతేకాకుండా బండచాకిరినీ, వంట కోసం ఎక్కువ సమయం కేటాయించటాన్ని తగ్గిస్తుంది. దీంతో పాటు వంట గ్యాస్ సరఫరా వ్వవస్థలో గ్రామీణ యువత పాలుపంచుకునేందుకు అవకాశాలను కూడా కల్పించి వారి ఉపాధికి బాట వేస్తుంది. 
 ఈ దిశగా ఆర్థిక మంత్రి 29-2-2016 న తన బడ్జెట్ ప్రసంగంలో రూ. 2,000 కోట్ల బడ్జెట్ కేటాయింపుల గురించి ప్రకటించారు. ఈ నిధులను వినియోగించి దారిద్ర్య రేఖకు దిగువన నివశిస్తున్న 1.5 కోట్ల మహిళలకు ఎటువంటి ధరావతు లేకుండానే ఎల్పీజీ కనెక్షన్లు ఇస్తారు. దీనికి తోడు ఈ పథకాన్ని మరో రెండు సంవత్సరాలపాటు కొనసాగించి మొత్తం 5 కోట్ల కుటుంబాలను ఈ పథకం కింద లబ్దిదారులను చేస్తారు.    

No comments:

Post a Comment

COMMUNISM FREDOM FOR WOMEN

 COMMUNISM IS FREEDOM FOR WOMEN  స్త్రీలను నిర్బంధించి, సంఘటితం చేసే పెట్టుబడిదారీ సమాజాలకు భిన్నంగా, కమ్యూనిజం స్త్రీ పురుషుల సమానత్వాన్ని ...