TERRESTS ARRESTED BY NIA

కు ట్ర భగ్నం 

HYDERABAD లో  శుక్రవారం  ఉగ్రవాదులు ను  అరెస్టు  చేసిన  NIA 
గ్రవాదుల నుంచి పెను ముప్పు తప్పింది. పారిస్‌దాడి తరహాలో భారీ దాడులకు జరిగిన కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) మొగ్గలోనే తుంచేసింది. కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌లో ‘జనూద్‌ ఉల్‌ ఖలీఫా ఎ హింద్‌ (భారత ఖలీఫా సైన్యం)’ అనే ఉగ్రవాద సంస్థకు చెందిన 14 మందిని అదుపులోకి తీసుకుంది. వీరిలో ఆరెస్టు చేశామని, మరో ఎనిమిది మందిని తదుపరి విచారణ కోసం అదుపులో ఉంచుకున్నామని ఎన్‌ఐఏ వెల్లడించింది. వీరిలో ఒకరు ప్రధాని మోదీపై దాడికి కుట్ర పన్నినట్లు భావిస్తున్నారు. ఈ సంస్థ భావజాలాలు, నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌ భావజాలాలు దాదాపు ఒకటిగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఐస్‌ఐఎస్‌కు చెందిన కొందరితో వీరంతా ఇంటర్నెట్‌లో అనుసంధానంలో ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా దక్షిణాదిరాష్ట్రాలు, మెట్రోనగరాల్లో విధ్వంసం సృష్టించేందుకు ఐఎస్‌ఐఎస్‌ వ్యూహరచన చేసినట్లు పోలీసు అధికారులు చెప్పారు. ముఖ్య అతిథిగా ఫ్రాన్స్‌అధ్యక్షుడు ఫ్రాన్స్‌వో హోలన్‌ భారత్‌కు రానున్న నేపథ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని విధ్వంసాలకు కుట్రపన్నింది. కేంద్ర నిఘా వర్గాలు ఈ సమాచారాన్ని ఎన్‌ఐఏకు అందించడంతో దేశవ్యాప్తంగా ఒకే సారి అపరేషన్‌ చేపట్టాలని నిర్ణయించుకున్నారు. వివిధ రాష్ట్రాల పోలీసులు, కేంద్ర భద్రతా సంస్థలతో ఎన్‌ఐఏ సమన్వయం చేసుకుంది. నాలుగు రాష్ట్రాల్లో గురువారం రాత్రి నుంచి వేట సాగించి శుక్రవారం రాత్రికి ఆపరేషన్‌ ముగించింది. బెంగళూరు, తుమకూరు, మంగళూరు, హైదరాబాద్‌, ముంబయి, లఖ్‌నవూలో 12 చోట్ల ఎన్‌ఐఏ, పోలీసుల అధికారులు సోదాలు నిర్వహించారు. మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం మరో రెండు చోట్ల సోదాలు నిర్వహించింది.
ముంబయి, థానె నుంచి ముగ్గురిని, హైదరాబాద్‌ నుంచి నలుగురిని, బెంగళూరు నుంచి నలుగురిని తుమకూరు, మంగళూరు, లఖనవూ నుంచి ఒకొక్కరిని అదుపులోకి తీసుకున్నారు. ‘జనూద్‌ ఉల్‌ ఖలీఫా ఎ హింద్‌’కు తాను అధిపతి (అమీర్‌)నని ముంబయి వాసి మునాబీర్‌ ముస్తాక్‌ ప్రకటించుకున్నాడు. దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పేలుళ్లకు, కొంతమంది విదేశీయులపై దాడులకు ఈ సంస్థ కుట్రపన్నిందని కేంద్ర హోం మంత్రిత్వశాఖ వర్గాలు వెల్లడించాయి. గత ఎనిమిది నెలల కాలంలో నిందితులు దేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శించారు. దాడి కోసం కొన్ని ముఖ్యమైన ప్రదేశాలను ఫొటోలు తీసుకున్నారు. కొంతకాలం నుంచి నిఘా ఉంచామని, దేశంలో సంచలనాత్మక దాడులు చేయాలని వారికి సూచనలు రావడంతో అరెస్టు చేయాలని నిర్ణయం తీసుకున్నామని అధికార వర్గాలు వెల్లడించాయి. నిందితుల్లో ఎక్కువ మంది యువకులే. దాదాపు అందరూ విద్యావంతులే. కొందరు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. జనూద్‌ ఉల్‌ ఖలీఫా ఎ హింద్‌కు ఒక వ్యవస్థ ఉందని ప్రాథమిక విచారణలో తేలడంతో మరింత విచారణ నిమిత్తం నిందితులందరినీ దిల్లీకి తరలించనున్నారు. వారి నుంచి డిటొనేటర్లు, ఇతర పేలుడు పదార్థాలు, వైర్లు, బ్యాటరీలు, ల్యాప్‌టాప్‌లు, హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌, లెక్కలు చూపని నగదు, వీడియోలు, జిహాదీ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 42 మొబైల్‌ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఎనిమిది ఫోన్లు ‘అమీర్‌’వే. ఈ ఉగ్రవాద సంస్థకు విదేశాల నుంచి హవాలా మార్గం ద్వారా నిధులు కూడా అందినట్లు అధికారులు చెబుతున్నారు. ఇండియన్‌ ముజాహిదీన్‌కు చెందిన యూసుఫ్‌గా పిలుచుకునే సఫీ అర్మర్‌తో వీరికి సంబంధాలున్నట్లు కూడా హోం మంత్రిత్వశాఖ అధికారులు చెప్పారు.
‘‘పేలుడు పదర్థాలు, ఆయుధాల సేకరణకు మార్గం ఏర్పర్చుకునేందుకు, తుపాకుల వినియోగంలో శిక్షణ శిబిరాలు నిర్వహించేందుకు తగిన ప్రదేశాలను గుర్తించడానికి, పోలీసు అధికారులను, విదేశీయులను లక్ష్యంగా చేసుకునేలా కొత్తగా నియమితులయ్యేవారిని ప్రేరేపించడానికి, దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలను చేపట్టేందుకు వీరు ప్రణాళికలు రచిస్తున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారు.’’ అని ఎన్‌ఐఏ ఒక ప్రకటనలో తెలిపింది. అరెస్టయిన ఐదుగురు పేర్లను ఎన్‌ఐఏ వెల్లడించింది. ఆరో వ్యక్తి పేరు వెల్లడి కాలేదు.
షానవాజ్‌కు బెదిరింపు లేఖ
దిల్లీ: ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థ నుంచి తనకు బెదిరింపు లేఖ అందినట్లు భాజపా నేత షానవాజ్‌ హుస్సేన్‌ తెలిపారు. న్యూదిల్లీ ప్రాంతంలోని తన నివాసానికి పోస్టులో ఈలేఖ అందినట్లు షానవాజ్‌ చెప్పారు.
మోదీ హత్యకు కుట్ర..
కర్ణాటకలో అరెస్టయిన ఆరుగురు ఉగ్రవాదుల్లో ఒకడైన నజ్ముల్‌ హుదా తాము గాలిస్తున్న అతి ముఖ్యమైన 20 మంది అనుమానిత ఉగ్రవాదుల్లో ఒకడని బెంగళూరు పోలీసులు చెప్పారు. ప్రధాని మోదీని హత్య చేయాలని కుట్రపన్నిన వారిలో హుదా ఒకరని పోలీసులు అనుమానిస్తున్నారు. బిహారుకు చెందిన హుదా కుటుంబం గత దశాబ్ద కాలంగా బాజ్పేలో నివసిస్తోంది. నిందితుడి తండ్రి అక్కడి మసీదులో మౌల్వి. హుదా పాలిటెక్నిక్‌ చదివిన తర్వాత 2011లో ఇంజినీరింగ్‌లో చేరాడు. బెంగళూరులోని ఆర్‌.వి.ఇంజినీరింగ్‌ కళాశాలలో రసాయన ఇంజినీరింగ్‌ చదువుతూ అర్ధంతరంగా నిలిపేశాడని ప్రిన్సిపాల్‌ వెల్లడించారు. హుదాను మంగళూరు నగర శివార్లలోని బాజ్పాలో అరెస్టు చేశారు. మరో నలుగురిని బెంగళూరులో, ఒకరిని తుమకూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దిల్లీ పోలీసులు ఈ నెల మొదటి వారంలో అరెస్టు చేసిన బెంగళూరు వాసి మౌల్వి అన్జర్‌ షా ఖాసిం అందించిన సమాచారం ఆధారంగా శుక్రవారం వీరిని అదుపులోకి తీసుకున్నట్లు బెంగళూరులో పోలీసు అధికారులు ప్రకటించారు. ఇందులో ఆసిఫ్‌, అహద్‌లు బెంగళూరులోని ఫైనన్‌ మొహల్లాకు చెందినవారు. సుహైల్‌ది కాటన్‌పేట. మహ్మద్‌ అఫ్జల్‌ థణిసంద్రకు చెందిన వ్యక్తి. జక్కసంద్రలోని ఒక ఫ్లాట్‌లో మంతనాలు సాగిస్తున్నపుడు ఆ నలుగురినీ అరెస్టు చేశారు. వారి నుంచి ఎ.కె.47, ఇతర మారణాయుధాలు, భారీగా స్వాధీనం చేసుకున్నారు. సయ్యద్‌ అన్జర్‌ బాష ముజీద్‌ను తమకూరులో అరెస్టుచేశారు. సయ్యద్‌ అన్జర్‌ బాషాను అల్‌ఖైదా కార్యకర్తగా భావిస్తున్నారు. ఈయన ఎం.ఐ.ఎం. తుమకూరు జిల్లాశాఖ అధ్యక్షుడు కూడా.

  అరెస్టయిన వారు వీరే
ముత్తబిర్‌ ముస్తాక్‌ షేక్‌ (33) -థానె
మహ్మద్‌ నఫీజ్‌ ఖాన్‌ (24)- హైదరాబాద్‌
మహ్మద్‌ షరీఫ్‌ మొయినుద్దీన్‌ ఖాన్‌ (54)- హైదరాబాద్‌
నజ్ముల్‌ హుదా (25)-మంగళూరు
మహ్మద్‌ అఫ్జల్‌ (35)- బెంగళూరు

No comments:

Post a Comment

COMMUNISM FREDOM FOR WOMEN

 COMMUNISM IS FREEDOM FOR WOMEN  స్త్రీలను నిర్బంధించి, సంఘటితం చేసే పెట్టుబడిదారీ సమాజాలకు భిన్నంగా, కమ్యూనిజం స్త్రీ పురుషుల సమానత్వాన్ని ...