
HYDERABAD లో శుక్రవారం ఉగ్రవాదులు ను అరెస్టు చేసిన NIA
గణతంత్ర దినోత్సవం సందర్భంగా దక్షిణాదిరాష్ట్రాలు, మెట్రోనగరాల్లో విధ్వంసం సృష్టించేందుకు ఐఎస్ఐఎస్ వ్యూహరచన చేసినట్లు పోలీసు అధికారులు చెప్పారు. ముఖ్య అతిథిగా ఫ్రాన్స్అధ్యక్షుడు ఫ్రాన్స్వో హోలన్ భారత్కు రానున్న నేపథ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని విధ్వంసాలకు కుట్రపన్నింది. కేంద్ర నిఘా వర్గాలు ఈ సమాచారాన్ని ఎన్ఐఏకు అందించడంతో దేశవ్యాప్తంగా ఒకే సారి అపరేషన్ చేపట్టాలని నిర్ణయించుకున్నారు. వివిధ రాష్ట్రాల పోలీసులు, కేంద్ర భద్రతా సంస్థలతో ఎన్ఐఏ సమన్వయం చేసుకుంది. నాలుగు రాష్ట్రాల్లో గురువారం రాత్రి నుంచి వేట సాగించి శుక్రవారం రాత్రికి ఆపరేషన్ ముగించింది. బెంగళూరు, తుమకూరు, మంగళూరు, హైదరాబాద్, ముంబయి, లఖ్నవూలో 12 చోట్ల ఎన్ఐఏ, పోలీసుల అధికారులు సోదాలు నిర్వహించారు. మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం మరో రెండు చోట్ల సోదాలు నిర్వహించింది.
‘‘పేలుడు పదర్థాలు, ఆయుధాల సేకరణకు మార్గం ఏర్పర్చుకునేందుకు, తుపాకుల వినియోగంలో శిక్షణ శిబిరాలు నిర్వహించేందుకు తగిన ప్రదేశాలను గుర్తించడానికి, పోలీసు అధికారులను, విదేశీయులను లక్ష్యంగా చేసుకునేలా కొత్తగా నియమితులయ్యేవారిని ప్రేరేపించడానికి, దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలను చేపట్టేందుకు వీరు ప్రణాళికలు రచిస్తున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారు.’’ అని ఎన్ఐఏ ఒక ప్రకటనలో తెలిపింది. అరెస్టయిన ఐదుగురు పేర్లను ఎన్ఐఏ వెల్లడించింది. ఆరో వ్యక్తి పేరు వెల్లడి కాలేదు.
షానవాజ్కు బెదిరింపు లేఖ
దిల్లీ: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ నుంచి తనకు బెదిరింపు లేఖ అందినట్లు భాజపా నేత షానవాజ్ హుస్సేన్ తెలిపారు. న్యూదిల్లీ ప్రాంతంలోని తన నివాసానికి పోస్టులో ఈలేఖ అందినట్లు షానవాజ్ చెప్పారు.
మోదీ హత్యకు కుట్ర..
కర్ణాటకలో అరెస్టయిన ఆరుగురు ఉగ్రవాదుల్లో ఒకడైన నజ్ముల్ హుదా తాము గాలిస్తున్న అతి ముఖ్యమైన 20 మంది అనుమానిత ఉగ్రవాదుల్లో ఒకడని బెంగళూరు పోలీసులు చెప్పారు. ప్రధాని మోదీని హత్య చేయాలని కుట్రపన్నిన వారిలో హుదా ఒకరని పోలీసులు అనుమానిస్తున్నారు. బిహారుకు చెందిన హుదా కుటుంబం గత దశాబ్ద కాలంగా బాజ్పేలో నివసిస్తోంది. నిందితుడి తండ్రి అక్కడి మసీదులో మౌల్వి. హుదా పాలిటెక్నిక్ చదివిన తర్వాత 2011లో ఇంజినీరింగ్లో చేరాడు. బెంగళూరులోని ఆర్.వి.ఇంజినీరింగ్ కళాశాలలో రసాయన ఇంజినీరింగ్ చదువుతూ అర్ధంతరంగా నిలిపేశాడని ప్రిన్సిపాల్ వెల్లడించారు. హుదాను మంగళూరు నగర శివార్లలోని బాజ్పాలో అరెస్టు చేశారు. మరో నలుగురిని బెంగళూరులో, ఒకరిని తుమకూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దిల్లీ పోలీసులు ఈ నెల మొదటి వారంలో అరెస్టు చేసిన బెంగళూరు వాసి మౌల్వి అన్జర్ షా ఖాసిం అందించిన సమాచారం ఆధారంగా శుక్రవారం వీరిని అదుపులోకి తీసుకున్నట్లు బెంగళూరులో పోలీసు అధికారులు ప్రకటించారు. ఇందులో ఆసిఫ్, అహద్లు బెంగళూరులోని ఫైనన్ మొహల్లాకు చెందినవారు. సుహైల్ది కాటన్పేట. మహ్మద్ అఫ్జల్ థణిసంద్రకు చెందిన వ్యక్తి. జక్కసంద్రలోని ఒక ఫ్లాట్లో మంతనాలు సాగిస్తున్నపుడు ఆ నలుగురినీ అరెస్టు చేశారు. వారి నుంచి ఎ.కె.47, ఇతర మారణాయుధాలు, భారీగా స్వాధీనం చేసుకున్నారు. సయ్యద్ అన్జర్ బాష ముజీద్ను తమకూరులో అరెస్టుచేశారు. సయ్యద్ అన్జర్ బాషాను అల్ఖైదా కార్యకర్తగా భావిస్తున్నారు. ఈయన ఎం.ఐ.ఎం. తుమకూరు జిల్లాశాఖ అధ్యక్షుడు కూడా.
ముత్తబిర్ ముస్తాక్ షేక్ (33) -థానె
మహ్మద్ నఫీజ్ ఖాన్ (24)- హైదరాబాద్
మహ్మద్ షరీఫ్ మొయినుద్దీన్ ఖాన్ (54)- హైదరాబాద్
నజ్ముల్ హుదా (25)-మంగళూరు
మహ్మద్ అఫ్జల్ (35)- బెంగళూరు
No comments:
Post a Comment