Telangana Girijanasangam new starte body

తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం
రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక అధ్యక్షులుగా సున్నం రాజయ్య
ప్రధాన కార్యదర్శిగా తొడసం భీంరావు
ఉట్నూర్‌ : తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర తొలి మహాసభలు ఉట్నూర్‌లోని హెచ్‌కేఎన్‌ గార్డెన్‌ (బీడీ శర్మ నగర్‌)లో సోమవారం ముగిశాయి. చివరి రోజున తెలగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రతినిధుల మహాసభల సందర్భంగా రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకున్నారు. 25 మందికి కమిటీలో స్థానం కల్పించారు. అధ్యక్షులుగా మరోసారి సున్నం రాజయ్య ఎన్నికకాగా, ప్రధాన కార్యదర్శిగా తొడసం భీంరావును ఎన్నుకున్నారు. వీరితోపాటు ఉపాధ్యక్షులుగా దుగ్గికృష్ణ, బండారు రవికుమార్‌, పీసోమయ్య, సహాయకార్యదర్శులుగా తవిటి నారాయణ, కారం పుల్లయ్య, కనక గణపత్తి, మెస్రం రాజు (విద్యార్థి రంగం నుండి) ఎన్నికైనట్టు ఆదివాసీ అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌ జాతీయ కన్వీనర్‌ మిడియం బాబురావు ప్రకటించారు. రాష్ట్ర కమిటీ సభ్యులుగా సరియం కోటేశ్వర్‌రావు, సున్నం బాబురావు, ధర్ముల సీతారాములు, వజ్జిసురేష్‌, వజ్జి రామారావు, కాక బాబు, ఆత్రం భగవంతరావు, వైతం భీంరావు, కుడ్మెత ముధు, మాడవి సన్నీబాయి, ఎర్మ పున్నం, దిగిని సమ్మయ్య, కోట్టెం కృష్ణయ్య, ఎక్నని రామారావు ఎన్నికయ్యారు.

No comments:

Post a Comment

COMMUNISM FREDOM FOR WOMEN

 COMMUNISM IS FREEDOM FOR WOMEN  స్త్రీలను నిర్బంధించి, సంఘటితం చేసే పెట్టుబడిదారీ సమాజాలకు భిన్నంగా, కమ్యూనిజం స్త్రీ పురుషుల సమానత్వాన్ని ...