చంద్రబాబు కొత్త గేమ్!
సర్కారు నిర్ణయంతో ఖజానాకు చిల్లు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొత్త గేమ్ ప్రారంభించారు. రాష్ట్రం చాలా కష్టాల్లో ఉందని నిత్యం చెప్పే సీఎం..కాంట్రాక్టర్ల దగ్గరకు వచ్చేసరికి ఎక్కడలేని ఔదార్యం చూపిస్తున్నారు. కష్టాలు ప్రజలకే కానీ..ప్రభుత్వంలో ఉన్నవారికి..కాంట్రాక్టర్లకు కాదన్నట్లు ఉంది సర్కారు తీరు. నిధులలేమితో తాము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటున్నట్లు పదే పదే చెబుతున్న చంద్రబాబు తాజాగా జరిగిన రోడ్లు, భవనాల (ఆర్అండ్ బి) శాఖ సమీక్షలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అసలు కాంట్రాక్టర్లు అడగపోయినా..ఎలాంటి ప్రతిపాదనలు ఇవ్వకపోయినా నిర్ణీత గడువు కంటే ముందే పనులు పూర్తి చేసే వారికి ‘రాయితీలు’ ఇస్తామని ప్రకటించారు. ప్రతి ఫనికి గరిష్టంగా ఎన్ని రోజులు పడుతుందనేది ఇంజనీర్లు నిర్ణయిస్తారు. అంటే విధిగా పని పూర్తి చేయటానికి అంత సమయం పడుతుందనే లెక్కవేశాకే ఈ నిర్ణయం తీసుకుంటారు..అనుకోని పరిస్థితులు ఏవైనా ఎదురైతే తప్ప..నిర్దేశిత గడువులోగా పని పూర్తి చేయవచ్చు. అసలు నిర్ధేశించిన గడువు కంటే ముందు పూర్తి చేస్తే రాయితీ ఇస్తామనటం చాలా వివాదస్పద నిర్ణయం అని…దీన్ని ఆసరా చేసుకుని కాంట్రాక్టర్లు..ఇంజనీర్లు కుమ్మక్కు అయి కావాల్సిన దానికంటే ఎక్కువ గడువు పెట్టుకుని…ముందే పని పూర్తి చేయటం ద్వారా సర్కారు ఖజానాకు చిల్లు పెట్టే అవకాశం ఉందని ఓ ఇంజనీరింగ్ నిపుణుడు తెలిపారు.
ఇదంతా ఓ కొత్త గేమ్ లాగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. నిర్ణీత గడువు కంటే ముందు పనులు చేస్తే మూడు శాతం ఇన్సెంటివ్ ఇవ్వాలని నిర్ణయించినట్లు ఇంజనీరింగ్ వర్గాలు తెలిపాయి. ప్రతి ఏటా వేల కోట్ల రూపాయల పనులు జరిగే ఆర్అండ్ బిలో ఈ నిర్ణయం వల్ల వందల కోట్ల రూపాయల సర్కారు ఖజానాకు భారీగా చిల్లు పడటం ఖాయంగా చెబుతున్నారు. నిర్దేశిత గడువు కంటే ముందే పనులు పూర్తి చేయగలిగే టప్పుడు అదే కాలాన్ని టెండర్ నోటిఫికేషన్ లో పెట్టి పని చేయించుకోవాలి కానీ..అడగకపోయినా రాయితీలు…ప్రోత్సాహకాలు ఇస్తామనటం సరికాదని ఓ రిటైర్డు ఇంజనీర్ తెలిపారు. ఈ నెల 18న జరిగిన సమీక్షలో చంద్రబాబు పని చేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని హెచ్చరిక జారీ చేశారు. సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రే ప్రపంచ బ్యాంకు పనులు చేయని ట్రాన్స్ స్ట్రాయ్ ను రక్షిస్తూ వచ్చారు. ప్రపంచ బ్యాంకు ఈ సంస్థతో కుదిరిన ఒఫ్పందాన్ని రద్దు చేసుకోవాలని సూచించినా..అందుకు సీఎం ఆమోదం తెలపలేదు. కానీ సమావేశంలో మాత్రం గడువులోగా పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని ప్రకటించటం ఆనవాయితీగా మారిపోయిందని చెబుతున్నారు.
No comments:
Post a Comment